మార్చి 28న 'స్వర్ణాంధ్ర - స్వచ్ఛ ఆంధ్ర' కార్యక్రమం: 'జీరో వేస్ట్' దిశగా అడుగులు
అమరావతి: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన "స్వర్ణాంధ్ర - స్వచ్ఛ ఆంధ్ర" (SASA) కార్యక్రమం ఈ నెల 28వ తేదీన (శనివారం) బాపట్ల జిల్లాలోని చీరాలలో ఘనంగా జరగనుంది. గౌరవ ముఖ్యమంత్రి గారు స్వయంగా పాల్గొననున్న ఈ కార్యక్రమం కోసం స్వచ్ఛ ఆంధ్ర కార్పొరేషన్ మేనేజింగ్ డైరెక్టర్ బి. అనిల్ కుమార్ రెడ్డి, ఐ.ఏ.ఎస్. గారు అన్ని జిల్లాల కలెక్టర్లకు కీలక ఆదేశాలు జారీ చేశారు. ( లేఖ కొరకు క్లిక్ చేయండి ) ఈ నెల థీమ్: "జీరో వేస్ట్ ఇన్స్టిట్యూషన్స్" (వ్యర్థ రహిత సంస్థలు) మార్చి 2026 నెలకు గాను "జీరో వేస్ట్ ఇన్స్టిట్యూషన్స్" అనే థీమ్ను ప్రభుత్వం ఖరారు చేసింది. ప్రభుత్వ కార్యాలయాలు, పాఠశాలలు, ఆసుపత్రులు, అంగన్వాడీలు మరియు హాస్టళ్లను సంపూర్ణ వ్యర్థ రహిత సంస్థలుగా మార్చడమే ఈ నెల ప్రధాన లక్ష్యం. చేపట్టాల్సిన ప్రధాన కార్యక్రమాలు: ఈ ప్రత్యేక డ్రైవ్లో భాగంగా అన్ని ప్రభుత్వ సంస్థల్లో ఈ క్రింది పనులను చేపట్టాలని ఆదేశించారు: చెత్త విభజన: తడి, పొడి మరియు గృహ ప్రమాదకర వ్యర్థాలను 100% మూలంలోనే వేరు చేయడం. స్థానికంగానే పరిష్కారం: తడి వ్యర్థాలను కంపోస్టింగ్ లేదా బయోగ్యాస్ యూనిట్ల...